24, డిసెంబర్ 2015, గురువారం

దేవుడు, పవిత్ర గ్రంథం, నిజమెంత?

దేవుడు ఎక్కడ,ఎలా వుంటాడు! ఏ దేవుడు గొప్ప ,ఏ మతం,ఏ మత గ్రంధం గొప్ప ?
అసలు దేవుడి పేరుమీద జరిగినన్ని యుద్దాలు,హత్యలు,నానాగొడవ ఈ ప్రపంచంలొ మరేవిషయం మీదా జరగలెదనుకుంటా. వేలసంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలే దేవుడికి సమాదానమా.నాకెందుకో ఒకోసారి  మూర్ఖంగా వాటిని పట్టుకొని వేళ్ళాడు తున్నామా అనిపిస్తుంది. అన్నీ ఆఆ అవతారాలు పూర్తయ్ న కొన్ని  సంవత్సరాల తరువాత రాసినవే. వేదాల విషయంలో కొన్ని విని చెప్పినవంటారు.ఒక వేళ నిజమనుకున్నా వందల సంవత్సరాలు అదీ హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిన పరాయి పాలనలో  మగ్గిన తరువాత వేదాల్లో నిజమెంత అబద్దమెంత స్వార్థమెంత జొప్పించినదెంతో తెలియని పరిస్థితి. మనిషే వ్రాసిన ఈపవిత్ర గ్రంథాలపై అనేక విమర్శలున్నాయ్. దానికి తోడు మా గ్రంథం గొప్పదని చెప్పుకొనే క్రమంలో ఇతర మత గ్రంథాలని విమర్శిస్తూ బొచ్చడు పుస్తకాలు, బ్లాగులు రెడీగా ఉన్నాయ్. ఆత్మవిమర్శ కంటే పక్కవాణ్ని విమర్శించడమే బాగా టేస్టీగా ఉంటుంది కదా. నా ఉద్దేశం ఏ గ్రంథమైనా సరే వాటి నుంచి కాలం చెల్లిన విషయాలు పక్కన పెట్టి మంచిని,  అందరికి అంగీకారంమైన విషయాలు తీసుకునే అవగాహన రావాలి.నాకు తెలిసినంతలో అన్నీ మత గ్రంథాలు దేవుడు రూపరహితుడు,సర్వాంతర్యామి అని చెప్తున్నాయి. అసలు దేవుడి కి మతమేంటో రాజకీయపార్టీల్లాగ. ఒక వేళ దేవుడే కనక ఫలానా మతం లోకి వస్తేనే లేదా ఫలానా కానుకలు సమర్పిస్తేనే లేదా ఫలానా పూజలు చేస్తేనే కరుణిస్తానంటే వాడు దేవుడేలా అవుతాడు.